Header Banner

Ashwini Vaishnaw: దేశంలో రైలు ప్రయాణికులకు శుభవార్త! దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు! పాత మెమూ రైళ్లలో..

  Tue Jun 17, 2025 21:31        Travel

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 200 రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన నేడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మొత్తం 200 కొత్త రైళ్లలో 50 నమో భారత్‌ రైళ్లు, 100 మెమూ (MEMU) రైళ్లు, మరో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు ఉంటాయని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త రైళ్లకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు. అంతకుముందు, హర్యానాలోని మనేసర్‌లో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ గతి శక్తి మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ను అశ్వినీ వైష్ణవ్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మెమూ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను 8-12 నుంచి 16-20కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.

 

ఇది కూడా చదవండి: Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

ఈ నిర్ణయంతో తక్కువ దూరాలకు ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు. ముఖ్యంగా, తెలంగాణలోని కాజీపేటలో కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, అక్కడ 100కు పైగా మెమూ రైళ్ల తయారీ జరుగుతోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దీంతో పాటు, కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లను కూడా తయారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికుల రవాణాతో పాటు, సరుకు రవాణాలో కూడా భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి కొనియాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు సుమారు 720 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయని, అలాగే 1617 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందని ఆయన వివరించారు. ఈ గణాంకాలు రైల్వేల సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. కొత్త రైళ్ల రాకతో ప్రయాణికుల సేవలు మరింత మెరుగుపడతాయని రైల్వే అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నూతన రైలు సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఏయే మార్గాల్లో, ఏయే స్టేషన్ల మీదుగా నడుస్తాయన్న వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు. ఈ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Ashwini Vaishnaw #Indian Railways #railway minister #new trains #Namo Bharat trains #MEMU trains #Amrit Bharat trains #railway coach factory #Kazipet #railway passenger services